తెలుగు మాధ్యమం లో చదువు సాగనిస్తారా ?
తెలుగుదేశం, వైసిపి పార్టీలు రెండూ కూడా ప్రాధమిక విద్య ఇంగ్లీషు మాధ్యమానికి మార్చి.తెలుగును మాత్రం ఒక
సబ్జెక్టుగా ఉంచుతామని తమ మ్యానిఫెస్టోలలో ప్రకటించాయి.మన కోరిక ఏంటంటే
ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమం లో ఉంచి ఇంగ్లీషు ను ఒక సబ్జెక్టుగా
ఉంచమని.
సివిల్స్ లో సత్తాచాటిన తెలుగు తేజాలకు
సన్మానం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.ఇది మంచి సంప్రదాయం.కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలుగులోనే
డిగ్రీ దాకా చదివి ,తెలుగు సాహిత్యమే ఆప్షనల్ గా తీసుకొని ,తెలుగులోనే ఇంటర్వ్యూ కి హాజరై సివిల్స్ లో తెలుగు మాధ్యమం తోనే మూడవ ర్యాంకు సాధించిన
రోణంకి గోపాలకృష్ణ లాంటి వాళ్ళు తగిలితే
భాషాభిమానులకు ఒక పండుగ.తెలుగుమాధ్యమం లోనే డిగ్రీ దాకా చదివి సివిల్స్ కొడితే వాళ్ళు పెద్ద సాహసం చేసి మాత్రుభాషకు విజయం సాధించి
పెట్టినట్లే.ఇలాంటి వాళ్ళను గుర్తించాలి.తెలుగు
మాద్యమం ద్వారా పరీక్షల్లో నెగ్గే పద్దతుల్లో నైపుణ్యశిక్షణ ఇప్పించాలి.
తెలుగు మాధ్యమం లో చదివిన వారికి ప్రోత్సాహకాలు రిజర్వేషన్లు ఇచ్చి భాషను కాపాడవలసింది పోయి ఇంగ్లీషు కోసం తెలుగును నిర్మూలించడం ఎందుకు?విషయం అర్ధం కావాలేగానీ మన పిల్లలు మాత్రుభాషలో రాలగొడతారు.భాషాపరిజ్నానం కంటే భావవ్యక్తీకరణే ముఖ్యమనే పద్ధతిలో పరీక్షలు జరిగితే వేలాది మంది తెలుగు అభ్యర్ధులు పరీక్షలలో ఎదురీది వస్తారు.
తెలుగు మాధ్యమం లో చదివిన వారికి ప్రోత్సాహకాలు రిజర్వేషన్లు ఇచ్చి భాషను కాపాడవలసింది పోయి ఇంగ్లీషు కోసం తెలుగును నిర్మూలించడం ఎందుకు?విషయం అర్ధం కావాలేగానీ మన పిల్లలు మాత్రుభాషలో రాలగొడతారు.భాషాపరిజ్నానం కంటే భావవ్యక్తీకరణే ముఖ్యమనే పద్ధతిలో పరీక్షలు జరిగితే వేలాది మంది తెలుగు అభ్యర్ధులు పరీక్షలలో ఎదురీది వస్తారు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా దేశ భాషలకు స్వాతంత్య్రం
రాలేదు. మాతృభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట గాంధీజీ. భాషా చాతుర్యం
ఉంటే ఎంతటి క్లిష్టమైన వ్యవహారాలనైనా అవలీలగా పరిష్కరించుకోవచ్చు.చెప్పాలనుకున్న
విషయాలు సాఫీగా చెబుతూ నదీ ప్రవాహంలా ముందుకు సాగేది మాత్రుభాషే. ప్రపంచ భాషలను
శాసిస్తున్న ఆంగ్లం కూడా ఎన్నెన్నో పరభాషా పదాలను తనలో ఇముడ్చుకొని
నేడీ రూపం తీసుకొంది. ఇంగ్లీషు ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం
ఇముడ్చుకోవటమేకాక విశ్వవ్యాప్తంగా విద్యాలయాలను సమకూర్చుకొని విద్యార్ధులకు
నేర్పుతూ ప్రపంచ భాష గా ఎదిగింది. నాలుగు మాటలు ఇంగ్లీషు కలవకుండా తెలుగులో
మాట్లాడే పరిస్థితి నేడు మనకు లేదు. మన
పిల్లలు పై స్థాయిలోకి వెళ్లడానికి, బాగా చదవడానికి
ఇంగ్లీషు మీడియం చదువులే మంచివన్న అభిప్రాయానికి తల్లిదండ్రులు , ప్రభుత్వాలు
వచ్చేశాయి. ఇక్కడి భాషతో ఇక్కడే బతకవచ్చన్న భరోసా ఎప్పుడు ఏర్పడుతుంది? మాతృభాష బువ్వ పెడుతుందన్న విశ్వాసం ఎలా
వస్తుంది?
ఇంట్లో తెలుగు - బడిలో
ఇంగ్లీషు
మనిషి మాతృభాషలో ఆలోచిస్తాడు. మన
ఊహకూ, కాల్పనికశక్తికీ,
నూతన సృజనకూ మూలం మాతృభాషే.
మాతృభాషగా తెలుగు మన ఇళ్ళల్లో ఇంకా బ్రతికే ఉంది.”ఇంట్లో
తెలుగు - బడిలో ఇంగ్లీషు”
లా ఉంది మన జీవితం.. మన పిల్లలకు
నేర్పే చదువు కూడా తెలుగు మాధ్యమంలోనే ఉండాలని కొందరు అడుగుతున్నారు. మాతృభాషను
విస్మరించి పరభాషకు పట్టం ఎందుకు కడుతున్నారు అంటే ఉద్యోగాలు పరభాష లోనే
దొరుకుతున్నాయి కాబట్టి. మన పిల్లలకు మాతృభాషలో కనీసం ప్రాధమిక విద్య లేకపోవడం వల్ల పిల్లల్లో
సృజన పోయింది.అందుకే చాలా మంది ఇంగ్లీషు మీడియం లో చదివిన యువకులు , నాయకుల పిల్లలు తెలుగులో తప్పులు మాట్లాడుతున్నారు.
మన దేశం లో నేడు 60 శాతం విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారు.
ఎన్నోప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు ఆంగ్లంలోకి మారాయి.ప్రజలు కూడా ఈ
మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు మాధ్యమానికి ఎటువంటి ప్రోత్సాహకాలు
లేవు. ఆంగ్లమాధ్యమం వల్ల కొందరు విద్యార్ధులకు విదేశాలల్లొ ఉద్యోగాలు దొరకవచ్చేమో కానీ,
రాష్ట్ర ప్రజల భాషా సాహిత్యాల భవిష్యత్తును అది నాశనం చేస్తుంది. విద్యార్థులు కూడా
పరభాషా మాధ్యమం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.న్యాయం, వైద్యం, ఇంజినీరింగ్,
భౌతిక రసాయన శాస్త్రాలన్నీ
తెలుగులో నేర్పగలగాలంటే మాతృభాషలోనే ఆ సాంకేతిక సమాచారమంతా లభించేలా పదసంపద
ఎప్పటికప్పుడు పెరగాలి.ఇందుకు గాను తేలికగా అర్ధమయ్యే ఇంగ్లీషు పదాలను కూడా తెలుగు
పుస్తకాలలోకి తీసుకోవాలి.
పూర్వకాలం నుండి తెలుగు మాధ్యమ
విద్య కోసం కృషి సల్పిన సంస్థలను ఒకసారి గుర్తుచేసుకుందాం : వీటిని రెండు తెలుగు రాష్ట్రాలూ ఇంకా బలపరచాలి .ఆర్ధిక
వనరులు సమకూర్చాలి.
మదరాసు విశ్వవిద్యాలయ
తెలుగు విభాగం
మదరాసు విశ్వవిద్యాలయంలోని తెలుగు
విభాగాన్ని బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు 1927లో ఏర్పాటు చేశారు. వెలగపూడి సుందరరామయ్య మద్రాసు విశ్వ విద్యాలయంలో (1869) ఎం.ఎ.
తొలి పట్టభద్రుడు.చిలుకూరి నారాయణరావు 1929
తెలుగులో తొలి డాక్టరేట్. పీహెచ్డీ
అయినా ఎం.లిట్. వ్యాసమైనా ఆంగ్లంలో రాయాలనే నిబంధన మార్చి తెలుగుకు
అవకాశం ఇచ్చారు. 1928 నుంచి మదరాసు విశ్వవిద్యాలయంలో 182 మంది పిహెచ్.డి.లు, 425
మంది ఎం.ఫిల్. చేశారు.
విశ్వ విద్యాలయాలు,ట్రిపుల్ ఐటీలు
రాష్ట్రం లోని అన్నీ విశ్వ
విద్యాలయాలు, బాసర ,ఇడుపులపాయ,
నూజివీడు, ట్రిపుల్ ఐటీల
సెంటర్ల లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు తెలుగును ‘ఆప్షనల్
సబ్జెక్టు’గా చదవడానికి
అవకాశమిచ్చారు.
తెలుగు అకాడమీ అపూర్వ సేవ
1968 లో ఏర్పడిన తెలుగు అకాడమీ
డిగ్రీ విద్యార్ధులకు తెలుగు మాధ్యమం లో పాఠ్య పుస్తకాలను అందిస్తూ గొప్ప సేవ
చేసింది. తెలుగు భాషలో ఉన్నత విద్యకు అవసరమైన పాఠ్య, పఠనీయ, సంప్రతింపు
గ్రంథాలను తయారు చేసి ప్రచురించింది.ఉన్నత
విద్యారంగంలో బోధన, పరిపాలన భాషగా
తెలుగును సుసంపన్నం చేయడానికి అనువైన
సాధనాలను రూపొందించడమే ‘అకాడమీ’ పరమోద్దేశం.
తెలుగును అధికారభాషగా అమలు
చేయడానికి ప్రభుత్వానికి కావలసిన
సహకారం అందజేయడంతోపాటు- భాష ఆధునికీకరణ,
అభివృద్ధి, ప్రామాణికతకోసం
వివిధ గ్రంథాల రూపకల్పన చేసింది. పోటీ పరీక్షలకు అవసరమైన
పుస్తకాలు రూపొందించింది. తెలుగు సాహిత్యం,
సంస్కృతి, వివిధ విజ్ఞాన రంగాలకు
సంబంధించి సదస్సులను నిర్వహించింది.తెలుగును అధికార భాషగా అమలు చేయడానికి
కావలసిన నిఘంటువులను
రూపొందించింది. విద్యార్థులు, అధ్యాపకులకు
ఉపయోగపడే అనేక శాస్త్ర, సాంకేతిక గ్రంథాలను అనువదించింది.
బోధన మాధ్యమంగా
తెలుగు అమలుకు అవసరమైన ఎన్నో పాఠ్యపుస్తకాలను ప్రచురించింది. పేద విద్యార్థులకు ఉచిత పుస్తక పంపిణీ
కూడా చేసింది. నాణ్యమైన సిద్ధాంత వ్యాసాలకు,
తెలుగు మాధ్యమంగా చదివిన ఉత్తమ
విద్యార్థులకు పురస్కారాలనూ అందించింది. పీజీ స్థాయిలోనూ వివిధ వృత్తివిద్యా
కోర్సులకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించింది.రకరకాల పోటీపరీక్షల
పుస్తకాలను సమగ్రమైన సమాచారంతో ప్రచురించడంతోపాటు విద్యార్థి వ్యక్తిత్వ
వికాస గ్రంథాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. గణిత,
భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాల
సమాచారాన్ని సైతం పుస్తకాలుగా
ముద్రించారు.విజ్ఞాన, వైద్య, అర్థ, వాణిజ్య, సాంకేతిక రంగాల పారిభాషిక పదాలు
ఆయా పాఠ్యపుస్తకాల వెనక అనుబంధంగా ఇవ్వడంతోపాటు- పారిభాషిక
పదకోశాలనూ ప్రచురించింది.తెలుగు-తెలుగు,
ఇంగ్లిష్-తెలుగు, తెలుగు-ఇంగ్ల్లిష్, త్రిభాషా
నిఘంటువులను,కార్యాలయ పదావళి,
పరిపాలన-న్యాయ పదకోశము
ప్రచురించింది .
ప్రోత్సాహకాలతోనే తెలుగు వృద్ధి
తెలుగు మాధ్యమంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలుగులో పరీక్షలు రాసేవారికి 5 శాతం మార్కులను అదనంగా కలిపినా, తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకు చదివిన పిల్లలకు మొత్తం ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించినా తెలుగు భాషకు గొప్ప మేలు జరుగుతుంది. నానాటికి నీరసించి పోతున్న భాషకు బలవర్ధక ఔషధాలు ఇవ్వాలి కానీ అసలు ప్రోత్సాహకాలేమీ ఇవ్వకూడదు అని కొందరు తెలుగు వాళ్ళే వాదిస్తుండటం విచిత్రంగా ఉంది. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కదీసుకొచ్చినట్లే మన మాతృభాషలకు కూడా ప్రోత్సాహకాలిచ్చి బలపరచాలి, బ్రతికించాలి. డబ్బురాని విద్య దరిద్రానికే అంటారు. ఏ ఉద్యోగమూ రాక ఎందుకూ పనికిరాక పోయేటట్లయితే తెలుగులో ఎవరు చదువుతారు? ఎందుకు చదువుతారు? తెలుగు చదవడాన్ని పెంచాలంటే ప్రోత్సాహకాలు కూడా ఉండాల్సిందే.
1985 పరీక్షల వరకూ తెలుగు మీడియం అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కుల పునరుద్ధరణకోసం ప్రభుత్వం అసలు కోర్టులో ప్రయత్నమే చేయలేదు. ప్రోత్సాహక మార్కుల కేసులో దీటుగా ఎదుర్కొని వాదించగల తెలుగు న్యాయవాదిని నియమించి మార్కుల పునరుద్ధరణ జరపాలి. ప్రజల భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో ఎవరైనా న్యాయస్థానాలకు వెళితే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొంటున్నట్లుగా మన ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి. విషయం కోర్టులో ఉందన్న సాకుతో తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రకటించటాన్ని మరచిపోకూడదు. 5 శాతం అదనపు మార్కులను ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.
తెలుగు మాధ్యమం వారికన్నా ఇతర మాధ్యమాల వారు ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో చాలా ఎక్కువ మార్కులు ఎందుకు తెచ్చుకొంటున్నారు? పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టే కుటుంబాలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమానికే ఎందుకు పంపుతున్నాయి? ఆంగ్ల మాధ్యమ పంతుళ్ళ స్థాయిలో తెలుగు మాధ్యమ పంతుళ్ళకు కూడా జీతాలు ఇవ్వగలిగితే తెలుగు విజ్ఞానులు తెలుగునేలపైనే నిలబడతారు. తెలుగులో పోటీ పరీక్షల పుస్తకాలు వెల్లువెత్తుతాయి. తెలుగులో చదివితే కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయనే ధీమా ప్రభుత్వం కల్పించక తప్పదు. ప్రజలు ఏ పనికైనా ప్రయోజనం ఆశిస్తారు. ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంటే ప్రజలూ ప్రభుత్వాన్ని నిలుపుకుంటారు.మనిషి ఆశాజీవి. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి చేరతాడు. తెలుగు విద్యార్థుల్ని కాపాడుకోవటం ద్వారానే తెలుగును రక్షించుకోగలం. ఈ మర్మాన్ని గ్రహించే తమిళనాడు ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లు తమిళ విద్యార్థులకు కల్పించింది. అక్కడ ఎలా సాధ్యమయ్యిందో కనుక్కొని అదే పద్ధతి ఇక్కడ మనమూ అనుసరించాలి. అప్పుడు ఆంగ్ల మాధ్యమం వాళ్ళు కూడా తెలుగు మాధ్యమంలో చదవడానికి తరలివస్తారు. తమిళనాడులో నివసించే విద్యార్థులు తమిళంలో చదవక తప్పదు అని దివంగత ముఖ్యమంత్రి జయలలిత హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్కు అసెంబ్లీలో తెగేసి చెప్పారు. అక్కడ రాని పెను ప్రమాదం ఇక్కడ ఎందుకు వస్తుంది? భాష విషయంలో తమిళనాడునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం తమిళాన్ని అభివృద్ధి చేసుకోటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలూ అన్వేషించి సఫలమయ్యింది. అందువలన పై ప్రతిపాదనలకు తోడు ఉద్యోగ నియామక పరీక్షలలో తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలి. ఈ నియమం వల్ల అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు బాగా నేర్చుకొని పాస్ కాక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరి కావాలి. ప్రభుత్వోద్యోగులు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, వారి సమస్యలు వినాలి, వారికి అర్థమయ్యేట్లు పరిష్కార మార్గాల గురించి వారి భాషలోనే చెప్పాలి. కాబట్టి వారికి తెలుగులో పరిజ్ఞానం ఉండాల్సిందే.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు, అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి. అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, నియమాలు, నిబంధనలు, ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాషలోనే ఉండాలి. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, సముదాయాల బోర్డులు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ నామఫలకాలు, శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి. తెలుగు మన ప్రజల భాష. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆరు నెలల్లో తెలుగు నేర్చుకోవాలి. తెలుగులో సంతకం పెట్టాలి. తెలుగులో నోట్స్ రాయాలి. తెలుగు పిల్లలు తెలుగులోనే ఎందుకు వెనుకబడి ఉండాలి? మాతృభాషలో వెనుకబడేవాళ్ళు అన్ని భాషల్లోనూ వెనుకబడే ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మాతృభాషకు ఇచ్చే ప్రోత్సాహకాల పైన ఇక ఎవరు న్యాయస్థానాలకు వెళ్ళకుండా చట్టంలోనే నియమం పెట్టాలి.
తెలుగు మాధ్యమంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలుగులో పరీక్షలు రాసేవారికి 5 శాతం మార్కులను అదనంగా కలిపినా, తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకు చదివిన పిల్లలకు మొత్తం ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించినా తెలుగు భాషకు గొప్ప మేలు జరుగుతుంది. నానాటికి నీరసించి పోతున్న భాషకు బలవర్ధక ఔషధాలు ఇవ్వాలి కానీ అసలు ప్రోత్సాహకాలేమీ ఇవ్వకూడదు అని కొందరు తెలుగు వాళ్ళే వాదిస్తుండటం విచిత్రంగా ఉంది. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎక్కదీసుకొచ్చినట్లే మన మాతృభాషలకు కూడా ప్రోత్సాహకాలిచ్చి బలపరచాలి, బ్రతికించాలి. డబ్బురాని విద్య దరిద్రానికే అంటారు. ఏ ఉద్యోగమూ రాక ఎందుకూ పనికిరాక పోయేటట్లయితే తెలుగులో ఎవరు చదువుతారు? ఎందుకు చదువుతారు? తెలుగు చదవడాన్ని పెంచాలంటే ప్రోత్సాహకాలు కూడా ఉండాల్సిందే.
1985 పరీక్షల వరకూ తెలుగు మీడియం అభ్యర్ధులకు ఇచ్చిన 5 శాతం ప్రోత్సాహక మార్కుల పునరుద్ధరణకోసం ప్రభుత్వం అసలు కోర్టులో ప్రయత్నమే చేయలేదు. ప్రోత్సాహక మార్కుల కేసులో దీటుగా ఎదుర్కొని వాదించగల తెలుగు న్యాయవాదిని నియమించి మార్కుల పునరుద్ధరణ జరపాలి. ప్రజల భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో ఎవరైనా న్యాయస్థానాలకు వెళితే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొంటున్నట్లుగా మన ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి. విషయం కోర్టులో ఉందన్న సాకుతో తెలుగు విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రకటించటాన్ని మరచిపోకూడదు. 5 శాతం అదనపు మార్కులను ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.
తెలుగు మాధ్యమం వారికన్నా ఇతర మాధ్యమాల వారు ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో చాలా ఎక్కువ మార్కులు ఎందుకు తెచ్చుకొంటున్నారు? పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టే కుటుంబాలు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమానికే ఎందుకు పంపుతున్నాయి? ఆంగ్ల మాధ్యమ పంతుళ్ళ స్థాయిలో తెలుగు మాధ్యమ పంతుళ్ళకు కూడా జీతాలు ఇవ్వగలిగితే తెలుగు విజ్ఞానులు తెలుగునేలపైనే నిలబడతారు. తెలుగులో పోటీ పరీక్షల పుస్తకాలు వెల్లువెత్తుతాయి. తెలుగులో చదివితే కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయనే ధీమా ప్రభుత్వం కల్పించక తప్పదు. ప్రజలు ఏ పనికైనా ప్రయోజనం ఆశిస్తారు. ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంటే ప్రజలూ ప్రభుత్వాన్ని నిలుపుకుంటారు.మనిషి ఆశాజీవి. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి చేరతాడు. తెలుగు విద్యార్థుల్ని కాపాడుకోవటం ద్వారానే తెలుగును రక్షించుకోగలం. ఈ మర్మాన్ని గ్రహించే తమిళనాడు ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లు తమిళ విద్యార్థులకు కల్పించింది. అక్కడ ఎలా సాధ్యమయ్యిందో కనుక్కొని అదే పద్ధతి ఇక్కడ మనమూ అనుసరించాలి. అప్పుడు ఆంగ్ల మాధ్యమం వాళ్ళు కూడా తెలుగు మాధ్యమంలో చదవడానికి తరలివస్తారు. తమిళనాడులో నివసించే విద్యార్థులు తమిళంలో చదవక తప్పదు అని దివంగత ముఖ్యమంత్రి జయలలిత హోసూరు ఎమ్మెల్యే గోపీనాథ్కు అసెంబ్లీలో తెగేసి చెప్పారు. అక్కడ రాని పెను ప్రమాదం ఇక్కడ ఎందుకు వస్తుంది? భాష విషయంలో తమిళనాడునే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం తమిళాన్ని అభివృద్ధి చేసుకోటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలూ అన్వేషించి సఫలమయ్యింది. అందువలన పై ప్రతిపాదనలకు తోడు ఉద్యోగ నియామక పరీక్షలలో తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలి. ఈ నియమం వల్ల అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు బాగా నేర్చుకొని పాస్ కాక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరి కావాలి. ప్రభుత్వోద్యోగులు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, వారి సమస్యలు వినాలి, వారికి అర్థమయ్యేట్లు పరిష్కార మార్గాల గురించి వారి భాషలోనే చెప్పాలి. కాబట్టి వారికి తెలుగులో పరిజ్ఞానం ఉండాల్సిందే.
ఇంట గెలిచి రచ్చ గెలవాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి తెలుగు భాషనే ఉపయోగించాలి. ఆంగ్లం వాడకూడదు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, రాష్ట్రం వెలుపల ఉన్న చిరునామాదారులతో మాత్రమే ఆంగ్లం ఉపయోగించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలు, అన్ని స్థానిక సంస్థలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి. అన్ని శాసనేతర అవసరాలకు ప్రజలతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలకూ తెలుగు భాషనే ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, నియమాలు, నిబంధనలు, ఉపవిధులు అన్నీ కూడా తెలుగు భాషలోనే ఉండాలి. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, సముదాయాల బోర్డులు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ నామఫలకాలు, శంకుస్థాపన శిలాఫలకాలు తెలుగులోనే రాయించాలి. తెలుగు మన ప్రజల భాష. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆరు నెలల్లో తెలుగు నేర్చుకోవాలి. తెలుగులో సంతకం పెట్టాలి. తెలుగులో నోట్స్ రాయాలి. తెలుగు పిల్లలు తెలుగులోనే ఎందుకు వెనుకబడి ఉండాలి? మాతృభాషలో వెనుకబడేవాళ్ళు అన్ని భాషల్లోనూ వెనుకబడే ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మాతృభాషకు ఇచ్చే ప్రోత్సాహకాల పైన ఇక ఎవరు న్యాయస్థానాలకు వెళ్ళకుండా చట్టంలోనే నియమం పెట్టాలి.
తెలుగు భాషాభివృద్ధి
ప్రాధికార సంస్థ ఏర్పాటు
ఎట్టకేలకు 10.7.2018 న
తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటుకు జీవో నంబరు 40 వెలువడింది. అందులో
7 భాగాలలో కార్యాలయాలలో తెలుగు భాషాభివృద్ధికి చేయవలసిన పనులు,చేయకపోతే వేయవలసిన జరిమానాలతో సహా ఎన్నో నియమాలున్నాయి.ఈ
జీవో ప్రకారం తెలుగులో ఫైళ్ళు నడిపే ఉద్యోగులకో మద్దతు దొరికింది.కొన్నిజీవోలు
కూడా తెలుగులో వస్తున్నాయి.ముఖ్యంగా 7వ భాగంలో నిబంధనలు ఇలా ఉన్నాయి: 1. సంస్థ
బోర్డులు తెలుగులో పెట్టని యజమానికి రూ.50000 జరిమానా 3 నెలల జైలు,2.శంకుస్థాపన ,ప్రారంభోత్సవాల
శిలాఫలకాలు తెలుగులో ఏర్పాటు చెయ్యని శాఖాధిపతులకు రూ.10000 జరిమానా 3.ప్రజలతో
ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో జరపని ఉద్యోగికి రూ.5000 జరిమానా ,4.అధికార భాషగా తెలుగు ఎలా అమలు అవుతుందో సమీక్షించని
శాఖాధిపతికి రూ.5000జరిమానా 5.ప్రజలతో జరిపే కార్యకలాపాలలో తెలుగు భాష ఉపయోగించని
ఉద్యోగికి రూ.10000 జరిమానా 6. “తెలుగు
పాఠ్యాంశం గా గాని,బోధనా మాధ్యమంగా గాని అమలు చేయని విద్యాసంస్థాధిపతికి
రూ.50000/ జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షను విధించవచ్చు.ఇవి ఖచ్చితంగా అమలు
చేస్తే తెలుగు వ్యతిరేకులు దారికొస్తారు ,తెలుగు
వ్యతిరేక వాతావరణం తగ్గుతుంది.
తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు ఉద్యోగాలలో
రిజర్వేషన్లు
డిగ్రీ తెలుగు మాధ్యమం లో చదివిన
వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆనాటి మంత్రులు పల్లె
రఘునాధరెడ్డి, భూమా అఖిలప్రియ వాగ్ధానం చేశారు. తెలంగాణలో కేసీఆర్
ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇంగ్లీషు మీడియంలోనే ప్రవేశపెడతామన్నారు.
ఇంగ్లీషు మీడియం లేకపోవటం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు
పడిపోతున్నాయనీ, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదనీ ఉభయ రాష్ట్రాల్లో
చర్చ నడుస్తున్నది. మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.మరోవైపు రాష్ట్ర
మంత్రీ నారాయణ తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ఇంగ్లీషు
మాధ్యమంలోనే ఉద్యోగాలొస్తాయని, మున్సిపల్
పాఠశాలలన్నింటిలో తెలుగు మాధ్యమం
తీసేసి ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెడతామని ప్రకటించారు. ఎవరిమాటలు నమ్మాలి? ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను నేర్చుకొనే అవకాశం కోల్పోయి
మరోసారి స్వాతంత్ర్యాన్ని కోల్పోయాము. గత్యంతరంలేక పరాయి భాష లోకి తప్పనిసరై
కావాలనే మన పిల్లల్ని నేడుతున్నాము. తెలుగులోనే పరీక్షలు రాసి, ఆ భాషలోనే
ముఖాముఖిలో పాల్గొని, కేంద్రప్రభుత్వ
అధికారులుగా ఎంపికైనవారు ఎంతమంది
లేరు?అలా మాతృభాష ద్వారా ఉద్యోగాలను సాధించే స్థాయికి మన
పిల్లలను తీసుకెళ్ళాలని మన నాయకులు కూడా కోరుకోవాలి కదా?
సర్వీస్ కమీషన్ ఉద్యోగాలలో తెలుగు
మాధ్యమం ద్వారా డిగ్రీలు చేసిన వారికి ఎన్ని దక్కుతాయి?ప్రజల భాషకు పరిపాలనలో పట్టం కడతామనే నాయకుల
వాగ్దానాలు రెండు రాష్ట్రాల్లోనూ వినబడుతున్నాయి.తెలుగును ఉపాధి వనరుగా
మార్చాలని అందరూ కోరుతున్నారు.కొందరైతే ప్రజల భాష పదికాలాలపాటు పాలించాలని
తపిస్తున్నారు కూడా.తెలుగు విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు
పొందేలా చెయ్యాలి మన ప్రజా సేవ (పబ్లిక్ సర్వీస్) కమీషన్లు.
1985 వరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షల్లో తెలుగు మీడియం
డిగ్రీ విద్యార్థులకు ఇచ్చిన 5
శాతం ప్రోత్సాహక మార్కులు హై
కోర్టు తీర్పుతో ఆగిపోయాయి.ప్రభుత్వం హై కోర్టులో అప్పీల్ చేసి మార్కుల
పునరుద్ధరణకు ప్రయత్నించాలి. గ్రూప్ 1,
గ్రూప్ 2 సర్వీసు
ఉద్యోగాలలో డిగ్రీ తెలుగు మీడియంలో చదివిన వారికి గతంలో ఇచ్చిన మాదిరే 5% ప్రోత్సాహక
మార్కులు ఇవ్వాలి. తెలుగులో కార్యాలయ వ్యవహారాలు నడిపే అభ్యర్ధులకు
దారి ఇవ్వాలి. ఆఫీసుల్లో తెలుగు బ్రతకాలి. తెలుగు విూడియంలో చదివితే
ఉద్యోగాలు రావాలి. మన పిల్లలు తెలుగులో
చదవాలి. తెలుగు అధికారులు తెలుగులో కార్యాలయాలు నడపాలి. తెలుగు
మాధ్యమంలో చదివిన విద్యార్థుల్ని
ప్రోత్సహించి అధికారులుగా
చేయాలి.అప్పుడు జనం తండోపతండాలుగా తెలుగులో చదువుతారు. తెలుగు మీడియంలో చదివిన విద్యార్ధులకు
సర్వీసుకమీషను పరీక్షల్లో రిజర్వేషన్లు ,
ప్రోత్సాహక మార్కులు తిరిగి
ఇప్పించటానికి కృషి చేస్తామని 2012 ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీపై జీవోలు ఇవ్వాలి.
తెలుగు భాషలో సాధికారత
ఏదీ?
ఎవరి భాషలో వారికి విద్యను బోధిస్తేనే ప్రయోజనమన్నారు గిడుగు రామమూర్తి. బడి పలుకుల భాష కంటే పలుకుబడుల భాషే అవసరమని కాళొజీ చెప్పారు.అసలైన పురోగతి మాతృభాషతోనే సాధ్యమని గాంధీజీ వాదించారు. అమ్మభాషలో బోధన విద్యార్థి సృజనను ఎంతో పెంచుతుందని విశ్వకవి రవీంద్రుడు భావించాడు.ఇవేవీ పట్టించుకోకుండా ఇంగ్లీషులో మాత్రమే నేర్పుతున్న చదువు పిల్లలకు భారంగా మారింది. కళాశాల విద్య అర్థం కావటం లేదు.పనిమీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారికి అక్కడ ఏమి జరుగుతుందో తెలియటం లేదు. న్యాయస్థానాల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అక్కడ జరుగుతున్నప్రక్రియ కక్షిదారులకు అంతుపట్టడం లేదు. ఇటు సొంత తెలుగు భాష చెల్లక, అటు పరాయి కోర్టు భాష సాంతం తెలియక,ఎంతకీ అవగతం కాక అవస్థ పడుతున్నారు. సొంత భాషలో చెప్పుకోలేను, పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను' అన్నట్లు మారింది పరిస్తితి. అర్ధమైనా కాకపోయినా ప్రతి విషయం ఇంగ్లీషులోనే చెప్పుకోవాల్సి వస్తోంది.మాతృభాషలో స్వేచ్ఛగా మాట్లాడే భాగ్యాన్నిపోగొట్టుకున్నాం. సొంత మాటలను,పదసంపదను పోగొట్టుకొని మూగవాళ్ళలాగా బ్రతుకుతున్నాం.భాషా దారిద్య్రం, భావ దారిద్ర్యం రెండూ మన ప్రజల్ని బాధించేలా మన పాలనా,విద్యా,న్యాయ రంగాలను తయారు చేశారు.
ఎవరి భాషలో వారికి విద్యను బోధిస్తేనే ప్రయోజనమన్నారు గిడుగు రామమూర్తి. బడి పలుకుల భాష కంటే పలుకుబడుల భాషే అవసరమని కాళొజీ చెప్పారు.అసలైన పురోగతి మాతృభాషతోనే సాధ్యమని గాంధీజీ వాదించారు. అమ్మభాషలో బోధన విద్యార్థి సృజనను ఎంతో పెంచుతుందని విశ్వకవి రవీంద్రుడు భావించాడు.ఇవేవీ పట్టించుకోకుండా ఇంగ్లీషులో మాత్రమే నేర్పుతున్న చదువు పిల్లలకు భారంగా మారింది. కళాశాల విద్య అర్థం కావటం లేదు.పనిమీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారికి అక్కడ ఏమి జరుగుతుందో తెలియటం లేదు. న్యాయస్థానాల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో, అక్కడ జరుగుతున్నప్రక్రియ కక్షిదారులకు అంతుపట్టడం లేదు. ఇటు సొంత తెలుగు భాష చెల్లక, అటు పరాయి కోర్టు భాష సాంతం తెలియక,ఎంతకీ అవగతం కాక అవస్థ పడుతున్నారు. సొంత భాషలో చెప్పుకోలేను, పరభాషలో నవ్వలేను, ఏడ్వలేను' అన్నట్లు మారింది పరిస్తితి. అర్ధమైనా కాకపోయినా ప్రతి విషయం ఇంగ్లీషులోనే చెప్పుకోవాల్సి వస్తోంది.మాతృభాషలో స్వేచ్ఛగా మాట్లాడే భాగ్యాన్నిపోగొట్టుకున్నాం. సొంత మాటలను,పదసంపదను పోగొట్టుకొని మూగవాళ్ళలాగా బ్రతుకుతున్నాం.భాషా దారిద్య్రం, భావ దారిద్ర్యం రెండూ మన ప్రజల్ని బాధించేలా మన పాలనా,విద్యా,న్యాయ రంగాలను తయారు చేశారు.
భాషా ప్రయోజనాల్ని
అందరి దరికీ చేర్చే బాధ్యత ప్రభుత్వానిది. తెలుగునాట తెలుగు భాషాబోధనను
నిర్బంధం చేయాలి. ప్రాథమిక దశ నుంచి
ఉన్నత పాఠశాల చదువు ముగిసే పదో
తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధించాలి. పాఠ్యపుస్తకాల్ని పిల్లలందరికీ బాగా
అర్థమయ్యేలా రూపొందించాలి.
కన్నడ భాషాబోధనను అక్కడి ప్రభుత్వం ఉన్నత
పాఠశాలదాకా నిర్బంధం చేసింది. కర్ణాటకలో పనిచేసేవారికి ఆ భాష తప్పనిసరిగా
తెలిసి ఉండాలని తేల్చిచెప్పింది. తమిళనాడులో మాతృభాషలో చదివితేనే అక్కడ ఉద్యోగాలిస్తారు, మలయాళ భాష, సంస్కృతిని
పదిలపరచుకొనేందుకు అక్కడ ప్రత్యేకంగా ప్రాధికార సంస్థ ఏర్పాటైంది. ఒడిశా, గుజరాత్, పశ్చిమ్ బంగ, మహారాష్ట్రల్లోనూ
చదువుల్లో, ఉద్యోగాల్లో అక్కడి మాతృభాషలకే పెద్దపీట వేస్తున్నారు.
ఆంగ్లంలోని గ్రంథాల్ని
ఇజ్రాయెల్ తన భాషలోకి కొద్దికాలంలోనే తర్జుమా చేసుకొంది. అత్యాధునిక
పరిజ్ఞానానికి సంబంధించిన ఏ పదమైనా వెంటనే స్వీడన్ భాషలోకి అనువాదమవుతోంది
ఉన్నత న్యాయ స్థానాలలో తెలుగు కనీసం
ప్రవేశిస్తుందా?
మన పాఠాల్లో ఉన్న ‘తెలుగు’ ఎంత? ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు మాయమవుతోంది! ‘మార్కులకు పనికిరాని’ సబ్జెక్టుగా మిగిలిపోతోంది. తమిళనాడులో సెంట్రల్ సిలబ్సలోనూ తొమ్మిదవ తరగతి వరకు తమిళం తప్పనిసరిగా బోధించాల్సిందే.తెలంగాణలో పాఠశాల నుంచి జూనియర్ కళాశాల వరకు ఒక బోధనాంశంగా తెలుగు ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలుగును బోధించే విద్యాలయాలకు మాత్రమే తెలంగాణలో అనుమతి దక్కుతుందన్నాడు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామఫలకాలపై తెలుగు విధిగా కనిపించాలన్నాడు.
మన పాఠాల్లో ఉన్న ‘తెలుగు’ ఎంత? ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు మాయమవుతోంది! ‘మార్కులకు పనికిరాని’ సబ్జెక్టుగా మిగిలిపోతోంది. తమిళనాడులో సెంట్రల్ సిలబ్సలోనూ తొమ్మిదవ తరగతి వరకు తమిళం తప్పనిసరిగా బోధించాల్సిందే.తెలంగాణలో పాఠశాల నుంచి జూనియర్ కళాశాల వరకు ఒక బోధనాంశంగా తెలుగు ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలుగును బోధించే విద్యాలయాలకు మాత్రమే తెలంగాణలో అనుమతి దక్కుతుందన్నాడు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నామఫలకాలపై తెలుగు విధిగా కనిపించాలన్నాడు.
ఆంధ్రప్రదేశ్లో ఏమిటి
పరిస్థితి?
హైకోర్టులో తెలుగు వాదన పనికిరాదు
పొమ్మన్నాడో ప్రభుత్వ న్యాయవాది.
1952 లో తెలుగు భాష పేరుతో మన రాష్ట్రం ఏర్పడింది.భాషా
ప్రయుక్త రాష్ట్రాలలో మనదే మొదటి రాష్ట్రం.భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు
ఉద్దేశం ఏమిటి? తెలుగు
రాష్ట్రాన్ని తెలుగులోనే
పరిపాలించటం. గత 66 సంవత్సరాల సుధీర్గ కాలంలో తెలుగు పాలన
సిద్ధించిందా? ఏమి ఆశించి భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారో ఆ
ఉద్దేశాలు ఈనాటికీ నెరవేరకపోగా భవిష్యత్తులో కూడా ప్రజల
భాషలో పాలన నడుస్తుందనే ఆశలుకూడా వదులుకోవాలనే హెచ్చరికలు వస్తున్నాయి.
అసలు పాలించటానికి మీ భాష బ్రతికి ఉంటుందా అనే సవాళ్ళు నిత్యమూ
ఎదురవుతున్నాయి. తెలుగు జనమే ఇంగ్లీషు కాన్వెంట్లకు ఎగబడుతుంటే తెలుగు బడులు
నిలుస్తాయా తెలుగులో ఫైళ్ళు నడుస్తాయా అని పరిహాసాలు ఆడుతున్నారు. తెలుగు జాతి
మనది- నిండుగ వెలుగు జాతి అనే పాటను తెలుగు జాతి మనది- రెండుగ వెలుగు జాతి అని
పాడుకుంటున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు, దిగువ
కోర్టుల్లో న్యాయపాలన అంతా మాతృభాషలోనే సాగేందుకు వీలుగా రెండు హైకోర్టులూ
సాయపడాలని వేడుకుంటున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు అన్ని కోర్టుల్లో కూడా ఆంగ్లానికే ఆదరణ
దొరుకుతోంది.ఎన్నో అవాంతరాలున్నా తెలుగులో తీర్పులు ఇచ్చి కొందరు న్యాయమూర్తులు
సాహసోపేతమైన శ్రమ చేశారు.
తెలుగు జాతీయ భాష కావాలి
జాతీయ భాష కాగల అర్హత తెలుగుకే
ఉందన్నాడు జేబీ హాల్డెన్ .నిజమేననుకొని
సంబరపడ్డాం. కానీ ప్రాంతీయభాషగా
కూడా నిలదొక్కుకోలేక ఈనాడు తెలుగు
తల్లడిల్లుతోంది.ఉపాధి కోసం జనం కూడా ఆంగ్లం
మోజులో పడి కొట్టుకుపోతున్నారు.తెలుగు సొంతగడ్డపైనే
మనుగడ కోల్పోతున్నది. పిల్లల
మానసిక ఎదుగుదలకు మాతృభాష ఎంతో
కీలకం.పాఠశాలల్లో పదవ తరగతి వరకు విధిగా తెలుగు
మాధ్యమంలోనే బోధన సాగాలి. ప్రతి బడీ అమ్మ భాషకు గుడి అయినప్పుడే పిల్లలకు సొంత
భాష వస్తుంది. మాతృభాషలోనే అన్నివిషయాలూ నేర్చుకున్న పిల్లలే తమ సొంత భాషలో
పాలన చేయగలుగుతారు.
ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు మాట్లాడే
భాషల్లో తెలుగుది ఆరోస్థానం.మన ప్రజల నాలుకలపై అది నిత్యం నడయాడాలంటే ,మన పిల్లలు
తెలుగు నేర్చుకోవాలి. మాతృభాష కళ్లు అయితే,
పరాయిభాష కళ్లజోడు అన్నాడు అన్నాదురై.
తమిళం,మరాఠీ, కన్నడ బోధనలను
తప్పనిసరి చేస్తూ అక్కడ గట్టి చట్టాలు
చేశారు.ఆంధ్రప్రదేశ్లో తెలుగును
రాష్ట్ర భాషగా గుర్తిస్తూ 1966లోనే అధికార
భాషా చట్టాన్ని చేశారు.అధికార
భాషా సంఘం ఏర్పాటయ్యింది.తెలుగు
రాష్ట్రం అన్న పేరేగాని చట్టసభల్లో,
పాలన వ్యవహారాల్లో, పాఠశాలల్లో,తెలుగు అమలు
లేదు. ప్రభుత్వ పాలన కూడా తెలుగులో
జరగాలని పాలకులు ఆశిస్తున్నారో
లేక ఆశిస్తున్నట్లు నటిస్తున్నారో అని
అనుమానం కలుగుతోంది.కాబట్టి శాసన నిర్మాణ
క్రతువులో, పాలన వ్యవహారాల్లో
తెలుగును తప్పనిసరి చేయాలి.
రాష్ట్రపతి కోవింద్ కోరినట్లు కక్షిదారుల
భాషలోనే హైకోర్టు తీర్పులుండాలి.శాసన,
కార్యనిర్వాహక, న్యాయవిభాగాలన్నిటిలో తెలుగు
రాజ్యమేలాలి . రాజ్యసభలో హరికృష్ణ తెలుగులో మాట్లాడారు.నాకు అర్ధంకావటంలేదని,ఇంగ్లీషులోనో హిందీలోనో
మాట్లాడాలని వెటకారంగా మాట్లాడిన డిప్యూటీ చైర్మన్ కురియన్ కు అనువాదకుల్ని
పెట్టుకోవటం మీబాధ్యత అని గట్టిగా బుద్దిచెప్పారు.తన మాతృభాషలో
మాట్లాడే స్వేచ్చ ప్రతి సభ్యుడికీ ఉందని వెంకయ్యనాయుడు వెనకేసుకొచ్చారు.
తెలుగును వదిలి పిల్లల్ని ఇంగ్లీషులో చదివించేది ఉపాధికోసమే అని అందరికీ తెలుసు.అందుకని
మాతృభాషలు వదిలెయ్యాలా? ఎన్ని భాషలు వస్తే అంత మంచిది.
కానీ మరో భాష రాని వాళ్ళ మీద ఎక్కువ భాషలు వచ్చినవాళ్ళు తమ బహు భాషా ప్రతాపం
చూపకూడదు.ఎవరి భాషలో వారిని మాట్లాడనివ్వాలి.తెలుగులో మాట్లాడొద్దు
అనటం ఏమిటి?తెలుగులో మాట్లాడొద్దని పిల్లల మెడలో పలకలు వేలగట్టిన
స్కూళ్ళకూ రాజ్యసభకూ తేడా ఏమిటి?ఇది తెలుగు భాషకు
అవమానమే.మాతృభాషలో మాట్లాడటానికి
ముందుగా పర్మిషన్ తీసుకోవాలని నియమం
పెట్టటంలోనే హిందీ వాళ్ళ అహంకారం
ఉంది. 30 ఏళ్ళ క్రితం ఎన్టీరామారావు గారి పాలనలో తెలుగులోనే
సచివాలయం నుండి నాకు జవాబు ఇచ్చారు. జన భాషలోకే పాలన రావాలంటే ఎప్పటికప్పుడు ఆ
భాషకు మరిన్ని ఆర్ధిక సాంకేతిక సౌకర్యాలు సమకూర్చాలి. ఉపాధి అవకాశాలు పెరగాలి .
రాజకీయ శక్తులూ దన్నుగా నిలవాలి.
సాహిత్య అకాడమీలు,అధికారభాషా సంఘాలు
తెలంగాణాలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోనూ, ఇంటర్మీడియట్లోనూ బోధించవలసిన తెలుగు పాఠ్యాంశాలను నిర్ణయించే, పుస్తకాలను ముద్రించే బాధ్యత సాహిత్య అకాడమీది.ప్రభుత్వ, ప్రైవేటు భేదం లేకుండా ఒక తరగతి పిల్లలందరూ అవే పాఠ్యాంశాలను చదువుతూ భాషను సవ్యంగా, సక్రమంగా ఏకరీతిన అలవర్చుకోవాలని ఈ నియమం పెట్టారు.ప్రైవేటు విద్యాలయాల దయవల్ల పాఠశాలల్లో పదవతరగతి వరకూ తెలుగును తప్పనిసరి కాలేదు. మాధ్యమంగా ఐదోతరగతి వరకూ తెలుగును తేలేకపోయారు. ఇంగ్లీష్ మాధ్యమం ప్రజలే కోరుతున్నారన్నారంటూ నాయకులే వాదిస్తున్నారు.వారే ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లు,స్కూళ్ళు,కాలేజీలు నడుపుతున్నారు.వాళ్ళ పిల్లల్ని విదేశాలలో ఇంగ్లీషు చదువు చదివిస్తున్నారు. అసలు మాతృభాషకోసం ఎలాంటి ఆశయం లేనప్పుడు భాషోద్ధరణకు వాగ్దానాలు ఇవ్వటం , చట్టాలు తేవటం ఎందుకు?ఎవరికోసం?
తెలంగాణాలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోనూ, ఇంటర్మీడియట్లోనూ బోధించవలసిన తెలుగు పాఠ్యాంశాలను నిర్ణయించే, పుస్తకాలను ముద్రించే బాధ్యత సాహిత్య అకాడమీది.ప్రభుత్వ, ప్రైవేటు భేదం లేకుండా ఒక తరగతి పిల్లలందరూ అవే పాఠ్యాంశాలను చదువుతూ భాషను సవ్యంగా, సక్రమంగా ఏకరీతిన అలవర్చుకోవాలని ఈ నియమం పెట్టారు.ప్రైవేటు విద్యాలయాల దయవల్ల పాఠశాలల్లో పదవతరగతి వరకూ తెలుగును తప్పనిసరి కాలేదు. మాధ్యమంగా ఐదోతరగతి వరకూ తెలుగును తేలేకపోయారు. ఇంగ్లీష్ మాధ్యమం ప్రజలే కోరుతున్నారన్నారంటూ నాయకులే వాదిస్తున్నారు.వారే ఇంగ్లీషు మీడియం కాన్వెంట్లు,స్కూళ్ళు,కాలేజీలు నడుపుతున్నారు.వాళ్ళ పిల్లల్ని విదేశాలలో ఇంగ్లీషు చదువు చదివిస్తున్నారు. అసలు మాతృభాషకోసం ఎలాంటి ఆశయం లేనప్పుడు భాషోద్ధరణకు వాగ్దానాలు ఇవ్వటం , చట్టాలు తేవటం ఎందుకు?ఎవరికోసం?
మాయమాటలు
పాలకుల్లో మాతృభాషాభిమానం
మచ్చుకైనా లేదు. అధికార శ్రేణులకు తెలుగుపట్ల చిన్నచూపు
చెప్పనలవికాదు.తెలుగును అధికార భాషగా ప్రకటిస్తూ 1966లో చేసిన శాసనానికి
39 సంవత్సరాల తరవాత తీరిగ్గా 2005లో చట్టబద్ధ
ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలుగురాష్ట్రాల్లో ఉన్న తొమ్మిదికోట్లమంది తెలుగువారికి సేవలందించవలసిన
లక్షలాదిమంది ఉద్యోగులు వాస్తవానికి తెలుగులోనే పనిచేయవలసి ఉంటుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు వారి భాషలోనే పనులు చేసిపెట్టవలసిన
బాధ్యత ప్రభుత్వాలపైన, అధికారులపైన ఉన్నది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ
విధిగా తెలుగుభాషలోనే సాగించాలనేగా భాషాదినోత్సవాలలో పాలకులు మాట్లాడేది? మరి ప్రజలలో ఈ ఇంగ్లీషు మోజు పెంచేది ఎందుకు? పైశాచిక భాషానువాదాలతో తెలుగు అంటేనే ప్రజలు
ఠారెత్తిపోయేలా బ్యూరోక్రసీ కసిగా వెలగబెట్టిన నిర్వాకాలు ఎన్నో !
తెలుగు భాషకు ప్రాచీన హోదా
2008లో తెలుగు భాషకు
ప్రాచీన హోదా వచ్చింది. తెలుగు
ప్రాచీన భాషా పీఠాన్ని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలోకి తరలించనేలేదు. కేంద్రం నుంచి
2008–2019 వరకు సంవత్సరానికి 100
కోట్లు చొప్పున ప్రాచీన హోదా
నిధులు మనకు రావాలి. ఆ డబ్బులకోసం ప్రయత్నిస్తే
రెండు తెలుగు రాష్ట్రాలకు ఏడాయికి 50 కోట్లచొప్పున గడచిన పదేళ్ళకు 500 కోట్లు
వస్తాయి.ప్రాచీన హోదా డబ్బుతో ఏం చెయ్యొచ్చు?
1.తెలుగు భాషలో ఉన్న ప్రాచీన
సాహిత్య శాస్త్ర విజ్ఞానాలను ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో
భద్రపరుచుకోవచ్చు.
2.
తెలుగు సాంకేతిక నిపుణులకు
ఇంజనీరింగ్ విద్యార్థులకు
కాలుకదపకుండా గ్రామాల్లోనే
ఉపాధి కల్పించవచ్చు.
3. తెలుగు డిక్షనరీలు,పదకోశాలు
ముద్రించవచ్చు.
4.తెలుగులో పరిశోధనలు పెంచ వచ్చు.
తమిళనాడులో ఈ పనులన్నీ
జరిగిపోతుంటే తెలుగు రాష్ట్రాలవాళ్ళు కాలుకదపటం లేదు.
2013లో ఏర్పాటు చేసిన తెలుగు భాష సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా గానీ 2018 లో ఏర్పాటు చేసిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా గానీ ఏమేమి పనులు చేయించుకున్నారు?
భాష విషయంలో పాలకుల సంకల్పాలు,ప్రమాణాలు,గొప్పగా ఉంటున్నాయి.కానీ ప్రభుత్వాల ఉత్తర్వులు మాత్రం అమలు కావడం లేదు.తెలంగాణాలో సాహిత్య అకాడమీ, ఆంద్రప్రదేశ్ లో తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ వచ్చాయి. పాలనలోనూ, చదువుల్లోనూ తెలుగు కచ్చితంగా ఉండాలి. కార్యాలయాలలోనూ , పాలనలోనూ, కోర్టుల్లోనూ తెలుగును వెలిగించాలి.చిత్తశుద్ధిలేని నాయకుల మాటలతో ప్రజలలో నమ్మకం పోయింది.కూడు పెట్టని భాష మనకు – కోటీశ్వరులయ్యే చదువులు వాళ్ళకా? అని పేద ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విమర్శలను సాకుగా చూపి పాలకులు అసలు తెలుగు మాధ్యమానికే ఎసరు పెడుతున్నారు.
పాఠశాల స్థాయి నుంచే తెలుగు మాయం
భాష విషయంలో పాలకుల సంకల్పాలు,ప్రమాణాలు,గొప్పగా ఉంటున్నాయి.కానీ ప్రభుత్వాల ఉత్తర్వులు మాత్రం అమలు కావడం లేదు.తెలంగాణాలో సాహిత్య అకాడమీ, ఆంద్రప్రదేశ్ లో తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ వచ్చాయి. పాలనలోనూ, చదువుల్లోనూ తెలుగు కచ్చితంగా ఉండాలి. కార్యాలయాలలోనూ , పాలనలోనూ, కోర్టుల్లోనూ తెలుగును వెలిగించాలి.చిత్తశుద్ధిలేని నాయకుల మాటలతో ప్రజలలో నమ్మకం పోయింది.కూడు పెట్టని భాష మనకు – కోటీశ్వరులయ్యే చదువులు వాళ్ళకా? అని పేద ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ విమర్శలను సాకుగా చూపి పాలకులు అసలు తెలుగు మాధ్యమానికే ఎసరు పెడుతున్నారు.
పాఠశాల స్థాయి నుంచే తెలుగు మాయం
“తెలుగు రాష్ట్రాలు రెండూ భాషను కాపాడేందుకు
కట్టుబడాలి.మాతృ భాషలోనే మాట్లాడండి, మాతృభాషను ఎవరూ మరిచిపోవద్దు” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెబుతున్నారు . స్కూళ్ళ
లో తెలుగు నేర్పుతుంటే కదా పిల్లలకు ఆభాష వచ్చేదీ మాట్లాడేదీ ?ప్లేస్కూల్ పేరిట మూడో ఏడు దాటగానే బడిలో వేస్తున్నారు.వారికి...
మొదలు పెట్టడమే ఏ ఫర్ యాపిల్! ‘అ-అమ్మ, ఆ-ఆవు’ అని తెలుగు
అక్షరాలు నేర్పించరు. కొన్ని స్కూళ్లలో ఐదో
తరగతి దాకా తెలుగు చెప్పనే
చెప్పరు. 6,
7, 8 తరగతుల్లో మొక్కుబడిగా చదివితే
చాలు. 9,
10లో తెలుగు ఆప్షనల్ మాత్రమే! అంటే...
ఇష్టముంటేనే తీసుకోవచ్చు.ఇంటర్లో కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో
ప్రథమ భాషగా ఆంగ్లం,
ద్వితీయ భాషగా సంస్కృతం మాత్రమే బోధిస్తారు.
అసలు ఎక్కడా తెలుగు కనిపించదు.త్రిభాషా సూత్రం అమలు కాగితాలకే
పరిమితమవుతోంది.నాయకుల హామీల ప్రకారం ఎలిమెంటరీ స్థాయిలో పూర్తిగా
మాతృభాషలోనే బోధన ఉందా ?
ప్రైవేటు స్కూళ్లన్నీ ఇంగ్లీషు మీడియమే! ప్రైవేటు బడుల్లో బోధనా మాధ్యమంగా
తెలుగు ఎప్పుడో మాయమైపోయింది. ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది
మిగిలి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ
పడిపోతోంది. ప్రైవేటు,
కార్పొరేట్ బడుల్లోని ‘ఇంగ్లీషు’ మోజే దీనికి కారణం. ప్రైవేటు స్కూళ్లను తెలుగు బాట
పట్టించాల్సిన ప్రభుత్వం... తానే ఆంగ్ల మాయలో పడుతోంది. మునిసిపల్
పాఠశాలల్లో తెలుగు మీడియంను తగలేస్తూ... ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతోంది.
తల్లిదండ్రులు కూడా తమ
పిల్లలకు తెలుగు రాకపోవడాన్ని
గర్వంగా చెప్పుకొంటున్నారు.తెలుగులోనే డిగ్రీ దాకా చదివి ,తెలుగు సాహిత్యమే ఆప్షనల్ గా తీసుకొని ,తెలుగులోనే ఇంటర్వ్యూ కి హాజరై సివిల్స్ లో తెలుగు
మాధ్యమం తోనే మూడవ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణను మనం గుర్తు తెచ్చుకోవాలి.
తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల తెలుగు మాధ్యమానికి అండగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల తెలుగు మాధ్యమానికి అండగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్
కమీషన్లు తెలుగు మాధ్యమ విద్యార్ధులకు ఎంతో సేవ చేయవచ్చు. ఇవి జరిపే గ్రూప్ 1,2,3,4 ఉద్యోగ
నియమకాలలో డిప్యూటీ కలక్టర్,మున్సిపల్
కమిషనర్,ఏసీటీఓ,సబ్ రిజిస్ట్రార్,డిప్యూటీ
తహసిల్దార్,అసిస్టెంట్
లేబర్ ఆఫీసర్,అసిస్టెంట్ డెవల్పమెంట్ ఆఫీసర్,ఎక్స్టేన్షన్
ఆఫీసర్,ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్,అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,సీనియర్ ఆడిటర్,సీనియర్
అకౌంటెంట్,జూనియర్
అకౌంటెంట్,జూనియర్
అసిస్టెంట్,గ్రామపంచాయతీ సెక్రెటరీ లాంటి వన్నీ తెలుగులో
చేసే ఉద్యోగాలే. ఇవన్నీ ఐ ఏ ఎస్ ,ఐ పి
ఎస్ లాంటి ఉన్నతోద్యోగాలు
కావు.తెలుగు ప్రజలతో మమేకమై వారితో ముఖాముఖి తెలుగులో
మాట్లాడుతూ వారిమధ్యే నివసిస్తూ వారికి సేవలందించే ఉద్యోగాలు.తెలుగు
ప్రజల సమస్యలను సరిగ్గా విశ్లేషణ చేయాలి. గ్రామ సామాజిక , ఆర్థిక వ్యవస్థ
పై తగిన అవగాహన తెచ్చుకోవాలి.ప్రజా పరిపాలన పై పరిజ్ఞానం పెంచుకోవాలి.
అక్కడి ప్రజలు వారి భాషలో చెప్పే సమస్యలు,
పరిష్కారాలు,సూచనలు వినాలి,రాయగలగాలి . ఈ
నైపుణ్యాలన్నీ ప్రజల భాష లో తెలుగు మాధ్యమంలో చదివిన వారికే ఎక్కువగా
ఉంటాయి.
తమిళనాడు భాషా విధానం
అనుసరణీయం
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ తమిళ
మహాసభల్లో తమిళ మాధ్యమ విద్యార్ధులకు
ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా
లభించేలా కొన్ని తీర్మానాలు చేశారు. తమిళ
మీడియం అభ్యర్దులకు ఉద్యోగాలు
దొరకక పొతే ప్రజలు పిల్లల్ని తమిళ మాధ్యమం లో చదివించరనీ ,ఎవరూ చదవని భాష
నశిస్తుందనీ ,తమిళం పదికాలాలపాటు బ్రతకాలంటే ఆభాషలో మాత్రమే
చదివిన వారికి వెనుక బడిన కులాలవారికి ఇస్తున్నట్లుగా ఉద్యోగాలలో కూడా
రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశారు .అందుకోసం అత్యవసరంగా ఒక
ఆర్డినెన్స్ తెచ్చారు.శాసన సభలో,స్థానిక సంస్థల్లో ,ప్రభుత్వ
కార్పోరేషన్లు,కంపెనీలలో తమిళ
అభ్యర్దులకు 20 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని శాసించారు.
న్యాయస్థానం
సమర్ధించింది
తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్
మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ
మీడియం లో డిగ్రీ వరకు చదివిన
అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20
శాతం రిజర్వేషన్
ఇస్తున్నారు.చెన్నై హైకోర్టు కూడా 23.2.2016
న ఈ చట్టాన్ని
సమర్ధించింది.తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు
20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి
తప్పూ లేదని తేల్చేసింది.రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్
ప్రకారం ఎవరి భాషను వాళ్ళు
కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో
పాలనాభాషగా అధికారభాషగా అభివృద్ధి
చేసుకోవాలని కూడా తెలియ జేసింది.
తెలుగు రాష్ట్రాల
ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం
1.తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన అభ్యర్దులకు రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ ఇవ్వాలి.
2.తెలుగు మాధ్యమ అభ్యర్ధులకు పోటీ పరీక్షల్లో 5% ప్రోత్సాహక మార్కులు
పునరుద్ధరించాలి.
ఈ రెండు ప్రతిపాదనలు ప్రభుత్వాల
ఆమోదం పొంది జీవోలు వస్తే ఆ జీవోలతోపాటే తెలుగు మాధ్యమంలో విద్యా బోధనా జరిపే
స్కూళ్ళు,కోచింగ్ సెంటర్లు,పాఠ్య
పుస్తకాలూ మొదలైనవన్నీ వచ్చేస్తాయి.తెలుగు నేర్చుకునే పిల్లలద్వారా తెలుగు భాషకు
జీవం వస్తుంది.మన తెలుగు పిల్లల్నిఅన్ని విధాలా ప్రోత్సహించి ప్రభుత్వాలు కాపాడాలి.ఎన్నో హామీలతో మళ్ళీ
ఎన్నికలో చ్చాయి . తెలుగు ప్రజలు ఒక్క ప్రశ్న వేసుకోండి: తెలుగు మాధ్యమం లో చదువుకు,ఉపాధికి ఏ
పార్టీ అయినా హామీ ఇచ్చిందా ?
https://www.youtube.com/watch?v=stx1kXZpGwc
--- నూర్ బాషా రహంతుల్లా
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్