ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, జులై 2020, శుక్రవారం

ఇంటికో దోమల బ్యాటు ఇప్పించండి


ఇంటికో దోమల బ్యాటు ఇప్పించండి
ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఒక చిన్న దోమ చేతిలో చనిపోయాడని మనకు పాఠాలు నేర్పారు. 2030 సంవత్సరం నాటికి దేశంనుంచి మలేరియాను తుడిచిపెడతామని మోదీ ప్రభుత్వం ప్రతిన పూనింది. మానవాళికి మహా శత్రువులు దోమలు.దేశంనుండి దోమలను నిర్మూలించటానికి మేమేం దేవుళ్ళము కాదు.దేవుడుమాత్రమే చేయగలపని మమ్మల్ని అడగొద్దు అని దానేష్ ఈషేదాన్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.సౌరబ్ గంగూలీ ఇంట్లో కూడా డెంగీ దోమలున్నాయని, దోమలు 290 మీటర్ల ఎత్తులో గాలిలో ఎగురుతూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయని వాటికి ఎవరిరక్తాన్ని పీల్చాలో కూడా తెలుసని శాస్త్రవేత్తలు తేల్చారు. దోమకాటుతో మరణం ప్రమాదంతో సమానమని జాతీయ వినియోగదారుల కమీషన్ తీర్పు నిచ్చింది.మనిషికో పది దోమలను చేతులతో కొట్టి చంపండి అని గతంలో రోశయ్య గారు అన్నారు. చేతులతో చంపలేము.దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని గతంలో లోకేశ్ బాబుకూడా కొన్నాళ్లు నడిపారు స్వఛ్చభారత కార్యక్రమం మొదలుపెట్టిన మోడీ కరోనా సొంత ఉత్పత్తులపై ఆధారపడటాన్ని నేర్పిందన్నారు. భారత్‌పై పడుతున్న ఆర్థిక భారం ఏటా మలేరియాకు 12 వేలకోట్లు డెంగీ కి 7వేల కోట్లు. దోమలు పుట్టుకొచ్చే ప్రాంతాల్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కనిపెట్టాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిపుణుల ప్రతిపాదన ఆమలులోకి తేవాలి .
తెలుగు నేలపైనే మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ను నోబెల్‌విజేత సర్‌ రోనాల్డ్‌ రాస్‌ కనుక్కున్నారు . దేశానికి స్వాతంత్య్రం లభించే సమయానికి ఏటా ఏడున్నర కోట్ల మలేరియా కేసులు, ఎనిమిది లక్షల వరకు మరణాలు ఉండేవి. మలేరియా ముప్పు అన్నిరాష్ట్రాలలో తీవ్రతరంగా ఉంది.ప్రతి ఆరుగురిలో ఒకరు దోమకాటుకు గురవుతూ ఏటా రూ.15 వేలకోట్ల దాకా ఉత్పాదకతను నష్టపోతున్న దేశం మనది. దేశం నుంచి మలేరియాను పారదోలడానికి లక్షా పాతిక వేల కోట్ల రూపాయల దాకా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.తేమ వాతావరణంలో, చిత్తడి నేలల్లో దోమ తాకిడి జోరెత్తుతుంది.ఇండియా కన్నా నాలుగింతలు ఎక్కువ వర్షపాతం, భూభాగంలో అధిక అడవుల శాతం కలిగిన శ్రీలంక మూడేళ్ల క్రితమే మలేరియాను అరికట్టగలిగింది. ఇప్పటివరకు కరోనాతో ప్రపంచంలో 6.32 లక్షల మంది ,అమెరికాలోనే 1.46 లక్షల మంది,ఇండియాలో 29 వేల మంది చనిపోయారు. రానున్న రోజుల్లో కరోనా రానివారంటూ ఎవ్వరూ ఉండరు. మలేరియా జ్వరం లాగే అది కూడా వస్తుంది పోతుంది . కరోనాతో కలిసి జీవించక తప్పదు అంటున్నారు .మలేరియా నివారణ కోసం కనీసం ఇంటింటా దోమలబ్యాట్లు ఉండక తప్పదు.ప్రతి ఏటా మలేరియా చాలా మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. గిరిజన ప్రాంతంలో కష్టాలు తీవ్రంగా వున్నాయి. జగన్ గారి పచ్చతోరణం లో రెండు కోట్ల మొక్కలు నాటుతామన్నారు.మన్యం అడవుల్లో క్లోరోక్వీన్ మందును అందించే సింకోనా మొక్కలు భారీ ఎత్తున పెంచాలన్న శాస్త్రవేత్తల సూచన అమలు కాలేదు.గిరిజనులకు మందు పూసిన దోమలతెరలు ఇస్తున్నారు.గిరిజనులకు సింకోనా మొక్కల బెరడు తీసే పని అప్పగించవచ్చు,మన్యంప్రజలచేత దోమల బ్యాట్లు ,మందులు తయారుచేయించవచ్చు.
చైనాతో గొడవలు మొదలయ్యాక మన మార్కెట్లో దోమల బ్యాట్లు లేవు.గతంలో చైనా బ్యాట్లు వందరూపాయలకు దొరికేవి.ఇప్పుడు నిప్పో బ్యాటు వెయ్యి రూపాయలట.లేదా ఇంటర్నెట్ లో అమెజాన్ వాళ్ళకు ఆర్డరిచ్చి తెప్పించుకోవాలి.సామాన్యులు వాడే దోమల బ్యాట్లు ఎక్కువ ధర పెట్టి కొనక తప్పటం లేదు.కాబట్టి కుటీరపరిశ్రమలలో చైనాతో పోటీపడి,సబ్సిడీ ఇచ్చి,పన్నులు తగ్గించి చౌక ధరలకు దోమలబ్యాట్లు సరఫరా చేయించాలి.దేశం సాధించిన వైజ్ఞానిక పురోగతి మలేరియాను నిర్మూలించలేక బాధపెడుతోంది.కరోనా కాలంలో వానలు కురుస్తున్నాయి.వర్షాలతోపాటు విషజ్వరాలు కమ్ముకుంటాయి. ముసురుపట్టి మన్యంతోపాటు,పల్లపు ప్రాంతాలు వణుకుతున్నాయి.కరోనా క్రిమికి అమెరికాలాంటి చల్లటి దేశమే హాయి,భారతదేశపు వేడి ఎండ గిట్టదంటే బతికిపోయామని అనుకున్నాం.గాలిద్వారా,మురుగునీటి పైపులద్వారా కూడా కరోనా పాకుతుందని క్రమేణా వార్తలు వచ్చాయి. చెత్త పోగుపడి దోమల సంతతి పెరగకుండా పారిశుద్య కూలీలు శ్రామిస్తూనే ఉన్నారు. డెంగీ, మలేరియా కేసులు పెరగకుండా ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకూడదని మున్సిపాలిటీ వారు మైకు ప్రచారం చేస్తున్నారు.
దోమకాటుతో కరోనా రాదని ఓదార్పు పొందినా మలేరియా, డెంగూ,జీకా,చికన్ గున్యా , మెదడు వాపుల వంటి ప్రాణాంతక వ్యాధులు కాచుకొని ఉన్నాయి. సంవత్సరం పొడవునా అనునిత్యం మనుషుల్ని వేధించే దోమల నుండి ప్రజలను కాపాడుకోవాలి. దోమలసీజన్ నిరంతరాయంగా దేశంలో తిష్టవేసి ఉన్నందువలన దోమల బ్యాట్లతయారీదారుల్ని,యువకుల్నీ ఆహ్వానించాలి.దోమల బ్యాట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.ఇది దేశ ప్రజల తక్షణ అవసరం.భారతీయ వైద్యులందరూ దోమల బ్యాట్ల తయారీకి మద్దతు తెలపాలి.ప్రభుత్వానికి సిఫారసు చెయ్యాలి.ప్రజల ప్రాణ రక్షణ కోసం ఏదేశపు ఉత్పత్తినైనా వ్యాక్సిన్లనైనా వాడుకోవలసిందే.ప్రజలప్రాణ రక్షణకోసం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వాడుతాం, ఊహాన్ వ్యాక్సిన్ ను కూడా వాడుతామని ట్రంప్ చైనా రాయబారకార్యాలయాన్ని మూయించాకకూడా అన్నారు. ప్రాణరక్షక మందుల్ని నిత్యావసరాలను వాడుకోవచ్చు.యుద్ధ ఆయుధాలకు ప్రాణ రక్షక మందులకు ఎంతో తేడా ఉంది. మనుషులతో యుద్ధానికి - క్రిములు,దోమలతో యుద్ధానికి తేడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దోమ కోట్లమందిని చంపింది. దోమలకు గిట్టని వాసన అంటూ ప్రజలు వేప, కొబ్బరి, నిమ్మ, యూకలిప్టస్‌ నూనెల్ని వాడుతున్నారు.లార్వా దశలోని దోమల్ని మటుమాయం చేస్తాయని చెరువుల్లోకి గంబూషియా చేపల్ని వదిలారు.సెప్టిక్‌ ట్యాంకుల పైపుల పైభాగంలో తీగల వలలు బిగించారు. రసాయనాలు కలిపిన కోడి ఈకల‘స్వీట్‌ కేకు’ దోమల లార్వా నియంత్రణకోసం పెట్టారు. బోదకాలు వ్యాధి మందు ఎవర్ మెక్టిన్ వాడిన రోగుల రక్తం తాగిన దోమలు 14 రోజుల్లోనే చనిపోతున్నట్లు తెలుసుకున్నారు. దోమల మందు లిక్విడ్‌,ఆయిల్ బాల్స్, కాయిల్స్‌ , డీడీటీ, ఫాగింగ్‌, దోమతెరలు.స్ప్రేలు,క్రీములు,టాయిలెట్ల గొట్టాలపై తీగల వలలు,దోమల బ్యాటులు లాంటి వాటితో మనిషి దోమలపై యుద్ధంచేస్తూనే వస్తున్నాడు. చివరికి ఆర్టీఎస్ అనే మలేరియా వ్యాక్సిన్ తయారుచేసి మలావి,ఘనా,కెన్యాలో పిల్లలకు వేశారట.దోమలబాధతో పాటు కరోనా లాక్ డౌన్లు తోడై దేశం అల్లాడుతోంది. ఇళ్ల లోపల,వెలుపల ప్రజలు దోమలను చంపే పనులు చేయనివ్వాలి.ప్రతి ఇంటికీ ఒక దోమలబ్యాట్ ను


ఉచితంగా గానీ చౌకధరకు గానీ ఇప్పిస్తే మంచిది.
 నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ , 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి