ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, అక్టోబర్ 2013, శుక్రవారం

అన్ని ప్రాంతాలలో అభివృద్ధి


                              అన్ని ప్రాంతాలలో అభివృద్ధి 
నూర్ బాషా రహంతుల్లా 9948878833
కొత్త రాష్ట్రానికి రాజధానిగా చేసేందుకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు,కర్నూలు,రాజమండ్రి, తిరుపతి లాంటి పట్టణాల పేర్లు కేంద్రం పరిశీలిస్తున్నదని తెలుస్తున్నది. అలాగే విజయవా డ,గుంటూరు,కర్నూలు,ఒంగోలు,నగరాల గురించి కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించిందని వార్తలొస్తున్నాయి. ఆయా ప్రాంతాల నాయకులు కూడా తమ కు దగ్గరలోని నగరాన్నే ఎందుకు రాజధానిగా చెయ్యాలో వివరిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పడబోతున్న రాష్ట్రానికి మళ్ళీ హైదరాబాదు లాంటి ఒకే మెగా సిటీని మాత్రమే రాజధానిగా అభివృద్ధి చేయదలిచారా? లేక అనేక నగరాలను వేరు వేరు రంగాలలో రాజధానులుగా ఉద్ధరించదలిచారా? గత అనుభవాలనుబట్టి ఏయే పాలనా కార్యాలయాలు ఎక్కడ, ఎలా ఉంటే మంచిదో సమగ్ర చర్చ జరపాలి. విభజన అనే ఊహనే తట్టుకోలేనంత ఆవేశంలో ఉన్న నాయకులు, ప్రజలు కొత్త రాజధానుల అంశాన్ని అసలు ఆలోచించటానికే ఇష్టపడటంలేదు. ఒకవేళ తప్పనిసరైతే రాజధానిని ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలని కొందరు నాయకులు మనసు విప్పారు. కానీ రాజధాని అంటే హైదరాబాద్ అంత భారీస్థాయి నగరంగా ఉండాలా? రాష్ట్రమంతటికీ ఒకే పెద్దనగరం ఉండాలా? అనేక రాజధానులుండాలా? అనే ఆలోచన ప్రజాక్షేమం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పుడన్నా శాస్త్రీయంగా ఆలోచన చెయ్యాలి. రాజకీయాలకతీతమైన ఆచరణాత్మకమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి. రాజధానులుగా ఉన్న ప్రాంతాలు మెట్రో నగరాలే కావాల్సిన అవసరంలేదు. పాలనాపరమైన కార్యకలాపాల నిర్వహణకు పరిమితమైతే చాలు. దేశంలోని కొన్ని రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రాల్లోని ఇతర నగరాలకంటే చాలా చిన్నగానే ఉన్నా యి. ఉత్తర్‌వూపదేశ్ రాజధాని లక్నో కంటే కాన్పూర్, అలహాబాద్, వారణాసి నగరాలే పెద్దవి. మధ్యవూపదేశ్ రాజధాని భోపాల్ కంటే ఇండోర్, ఒడిశా రాజధాని భువనేశ్వర్ కంటే కటక్ పెద్దది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ జనాభా 1.90లక్షలు కాగా అహ్మదాబాద్ జనాభా 39 లక్షలు. సూరత్ జనాభా 33 లక్షలు. అసోం రాజధాని డిస్పూర్ జనా భా లక్షలోపే. గౌహతి 15 లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కంటే హరిద్వార్, జార్ఖండ్ రాజధాని రాంచీ కంటే బొకారో, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ కంటే బిలాస్‌పూర్ పెద్దనగరాలు. దేశ రాజధాని ఢిల్లీ కంటే ముంబై, కోల్‌కతాలు పెద్ద నగరాలు. ఇప్పటికే పాతబస్తీలతో ఇరుకైపోయిన పాతనగరాలలోనే రాజధాని ఉండనక్కరలేదు.కొత్త పట్టణాలు కట్టవచ్చు. నయా రాయ్‌పూర్, గాంధీనగర్, భువనేశ్వర్ నగరాలను కొత్తగానే కట్టుకున్నారు.విమానాక్షిశయం, నౌకాక్షిశయం, ఓడ రేవులు, జాతీయ రహదారులు, రోడ్డు, సాగునీటి పథకాలు, నీటి సరఫరా, అండర్‌క్షిగౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, మురుగు శుద్ధి ప్లాంట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, పవర్ ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ గ్రిడ్‌లూ లాంటి మౌలిక వసతులు రాజధానికే కాకుండా ప్రతి పెద్ద పట్టణానికీ అవసరమే. వాటి కోసం కాంట్రాక్టర్లు ఎప్పుడూ పైరవీలు చేస్తుంటారు ఎంత దూరమైనా వెళ్ళి నిర్మాణం చేపడతారు. గానీ ఏ వసతి ఏ నగరానికి ఎంత వరకు అవసరమో హేతుబద్ధంగా నిర్ణయించుకోవాలి. గానీ అన్నీ వసతులూ ఒకే నగరంలో ఏళ్ళతరబడి కుప్పబోసి హైదరాబాదు లాగా, వలస జనవిస్పోటనంతో మహానగరం పేలిపోయేలా చేయకూడదు.

ప్రజల ప్రయాణం సుఖంగా ఉండేలా రాష్ట్రానికి రాజధాని భౌగోళికంగా ఆ ప్రాంతానికి మధ్యవూపాంతంలో ఉంటే మంచిది. కానీ అలా లేని రాష్ట్రాలూ ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నై తమిళులకంటే ఆంధ్రులకే దగ్గర. మద్రాసు నుంచి కన్యాకుమారి 900 కిలోమీటర్లు. పశ్చిమబెంగాల్ రాజధా ని కోల్‌కతా, మహారాష్ట్ర రాజధాని ముంబై కూడా ఆ రాష్ట్రాలకు ఒక మూలకు ఉన్నాయి. అసలు మన జిల్లా కేంద్రాలు కూడా కొన్ని జిల్లాల అంచుల్లోనే ఉన్నాయి. అలాంటి జిల్లాల్లో ప్రజలు జిల్లా కేంద్రాలకు ప్రయాణమంటే భయపడుతుంటారు. ప్రజల సౌకర్యంకోసం వివిధ జీవన రంగాలకు ఉపయోగపడేలా వివిధ నగరాలను అభివృద్ధి చేస్తే మళ్ళీ విభజనవాదాలు తలెత్తవు. ఆన్ని ప్రాంతాల ప్రజలు తృప్తి పడతారు. ఒకే నగరానికి వలసలు తగ్గుతాయి. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాల్ని కొనాలి. భారీ వ్యయంతో కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే అటవీ భూములు దొరికినా ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు మరోచోట భూములిచ్చి అటవీ భూముల్ని తీసుకోవచ్చు. లేదా అటవీ భూముల సేకరణకున్న అభ్యంతరాలను పక్కనపెట్టి నిరర్ధకంగా పడివున్న వాటిని కేంద్రమే కేటాయించవచ్చు. గనుల కోసం ప్రైవేటు కంపెనీలకు వేలాది ఎకరాల భూములు ఇస్తున్నట్లే ప్రభుత్వకార్యాలయాల నిర్మాణానికీ ఇవ్వవచ్చు. తూర్పుగోదావరిలో అటవీ భూములు 3,232 చదరపు కిలీమీటర్లు , గుంటూరులో 1619, ప్రకాశంలో 4,424, నెల్లూరులో 2,519, చిత్తూరులో 4,520, కడపలో 5,002, అనంతపురంలో 1969, కర్నూలులో 3,515 , శ్రీకాకుళంలో 686, విజయనగరంలో 1193, కృష్ణాలో 664, పశ్చిమగోదావరిలో 811 చదరపు కిలోమీటర్ల అటవీ భూములున్నా యి. వీటిలో రాజధాని పెడదామనుకున్న చోట భూములు ఉచితంగా ఇచ్చి అవసరమైన భవనాల నిర్మాణానికి నిధులిస్తే సరిపోతుంది. నిర్మాణం ఖర్చు మాత్రం ఎక్కడైనా తప్పదు. రాజధాని ఏర్పడిన తరువాత మిగిలిన మౌలిక వసతులు వాటంతటవే అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రంలో విశాఖపట్నం రెండ వ అతి పెద్ద నగరం. రైలు, రోడ్డు, విమానం, జలమార్గాల రవాణావ్యవస్థ బాగా అభివృద్ధి చెందాయి. రాష్ట్రానికి ఓ మూలగా ఉన్న పట్టణం. రాయలసీమ నుంచి రావాలంటే వ్యయ ప్రయాసలకు గురి కావాలి. నీటి లభ్యత తక్కువ. సుందరమైన ప్రకృతి దృశ్యాలున్న ప్రాంతం కాబట్టి సినీ పరిక్షిశమ కేంద్రీకరించవచ్చు. ఓడరేవులతో విదేశీ వాణిజ్య కేంద్రంగా ఇప్పటి కే వర్ధిల్లుతోంది కాబట్టి పరిక్షిశమల నగరంగా అభివృద్ధి చేయవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజల వివాదాల పరిష్కారానికి హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలి. ఐటీ పరిక్షిశమ కేంద్రంగానూ మలచవచ్చు. అసెంబ్లీ వేసవి సమావేశాలు ఇక్కడ నిర్వహించవచ్చు.

విజయవాడ - గుంటూరులో తాగునీరు పుష్కలం. ప్రభుత్వ భూములు లేవు. భూముల ధర ఎక్కువ. గన్నవరం విమానాక్షిశయం ఉంది. విజయవాడ, గుంటూరు,తెనాలి మూడూ రైల్వే జంక్షన్లే.ఈ త్రికోణం మధ్య స్థలం రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల వారి రాకపోకలకు అందుబాటులో ఉంటుం ది. గతంలో హైకోర్టు గుంటూరులోనే ఉండేది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించవచ్చు. విజయవాడ-గుంటూరు రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉండాలని ఎన్.జి.రంగా 1953లోనే కోరారు. దక్షిణమధ్య రైల్వేలో గుంటూరు,విజవాడ రెండూ పెద్ద రైల్వే డివిజన్‌లు . ఇప్పటికే గుంటూరు, విజయవాడ విస్తరించి జంట నగరాలుగా దాదాపు రెండూ కలిసిపోయాయి. ఈ రెండు నగరాలలో సెక్ర హైకోర్టు పెట్టొచ్చు. విజయవాడ జిల్లా కొత్తగా ఏర్పాటు చెయ్యాలి. ఒంగోలు చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. రాయలసీమ ఆంధ్రాకోస్తాకు కూడా మధ్యేమార్గంగా అనుకూలం. నీటి లభ్యత తక్కువ. మౌలిక వసతులు లేవు. అయిదవ నంబరు జాతీయ రహదారి ఉంది. సముద్ర తీరానికి సమీపంలో ‘వాన్‌పిక్’ భూములున్నాయి. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమంతా 1972కు ముందు కర్నూలు జిల్లాలో అంతర్భాగమే. రైల్వే జంక్షన్ కాదు. విమానాక్షిశ యం లేదు.ఈ రెండూ ఏర్పాటు కావాలి. శ్రీశైలం-ఒంగోలు రైలు మార్గం కొత్తగా నిర్మించాలి. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఒంగో లు గిత్తలు, గ్రానైటుకు సంబంధించిన పరిక్షిశమలు, అధ్యయన కేంద్రాలను అభివృద్ధి చెయ్యాలి. కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని. వరదల భయం ఉంది. రాష్ట్రానికి ఒక మూలన కర్ణాటక దగ్గరలో ఉంది. సామాన్య ప్రజలు సచివాలయానికీ డైరెక్టరేట్లకూ వెళతారుగానీ అసెంబ్లీకి వెళ్ళరు. కాబట్టి రాజకీయంగా అక్కడి పాత చరివూతను గౌరవిస్తూ మళ్ళీ అసెంబ్లీ అక్కడే పెట్టొచ్చు.తిరుపతి చెన్నై కి దగ్గరలోఉన్నది. తీర్ధయాత్రా కేంద్రం. రోజూ లక్షలాది భక్త యాత్రికులతో రద్దీగా ఉంటుంది. బాలాజీ జిల్లా కొత్తగా ఏర్పాటు చెయ్యాలి. యూనివర్సిటీలు, విమానాక్షిశయం ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంగానే ఉంచాలి. ఐటీ పరిక్షిశమ కేంద్రంగా మలచవచ్చు. రాజమండ్రి శతాబ్దాల చరితగల సుందర నగరం. 7,500 ఎకరాల అటవీ భూమి ఉంది. తెలుగు విశ్వవిద్యాలయాన్ని విస్తరించాలి. ప్రాచీన భాషా కేంద్రాన్ని మైసూరునుంచి ఇక్కడికి తరలించవచ్చు ఓఎన్‌జీసీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడికి తరలించాలి. రాష్ట్రంలోని ఆన్ని ప్రాంతాలవారికీ ఏదో ఒక పౌర ప్రాధాన్యం దక్కేలా ప్లాన్ చెయ్యాలి. రాష్ట్ర విభజన తర్వాత హడావిడిగా ఏదో ఒక నగరాన్ని మాత్రమే రాజధానిగా ప్రకటించి అభివృద్ధి అంతా అక్కడే జరిగేలా చూస్తే కొన్నేళ్ళకు హైదరాబాద్ అనుభవమే ఎదురౌతుంది. మళ్లీ విభజన వాదాలొస్తాయి. కనుక ఇకనైనా పాలకులు అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచించాలి.
                                                 -నూర్  బాషా రహంతుల్లా                                            (నమస్తే తెలంగాణ 26.10.2013)

http://www.namasthetelangaana.com/Editpage/article.aspx?Category=1&subCategory=7&ContentId=295122

https://www.facebook.com/photo.php?fbid=652701724761821&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి