ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, సెప్టెంబర్ 2020, గురువారం

వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చెయ్యాలి


వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చెయ్యాలి (గీటురాయి 2.10.2020)
దేశ జాతీయోత్పత్తి లో 18శాతం వ్యవసాయ రంగానిదే.మన దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వ్యవసాయరంగమే జీవనాధారం.సాగుచేస్తున్నవారిలో 82శాతం మంది చిన్న సన్నకారు రైతులే. పార్లమెంటులో మోదీకి ఎదురులేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ బిల్లుల కోసం దీక్షకు దిగారు. మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు నేగ్గాయి.వ్యవసాయ బిల్లును తేనె పూసిన కత్తి అని కేసీఆర్ వ్య్తతిరేకించారు.స్వపక్ష మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేషారు.హర్యానా జెజెపి ఎంఎల్‌ఎలు రోడ్డెక్కారు.18 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి విజ్నప్తి చేశాయి.కనీసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని బిజూజనతాదళ్ కోరగా ఈ బిల్లులు సంపన్నులకే మేలు చేస్తాయని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. వైసీపీ, టిడిపి,తమిళ మనీలా కాంగ్రెస్, బోడే పీపుల్స్ ఫ్రంట్ మద్దతు ప్రకటించాయి. గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని వైసీపీ చెబుతోంది కానీ రైతు బంధు, రైతు ఆసరా లాంటి పథకాలు కొనసాగాలంటే ఎలా ? బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు, అగ్రి బిజినెస్‌ సంస్థలు రైతాంగాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తారనే భయంతో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు సాగాయి.ఆహార ధాన్యాల నిల్వలపై పరిమితులను ఎత్తివేశారు.పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు, ఖాద్య తైలాలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగిస్తారు. వీటి నిల్వలపై పరిమితులను కూడా ఎత్తివేస్తారు. ఇందువలన బడా వ్యాపారస్తులు, కార్పొరేట్లు, బాగుపడతారు.నేరుగా రైతుల నుండి వర్తకులు,కొనుగోలు చేసే లావాదేవీలపై పన్నులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వుండదు. కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండదు. టోకు వ్యాపారస్తులతో, ఎగుమతిదారులతో, పెద్ద రిటైల్‌ సంస్థలతో మన రైతులు కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవాలి.రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. విత్తన చట్టం లేకపోవడం వల్ల విత్తనోత్పత్తి రైతులు కార్పొరేట్‌ విత్తన వ్యాపార సంస్థలకు వేల కోట్లు నష్టపోతున్నారు. కానీ విత్తన వ్యాపారులు మాత్రం పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయీలు 3 లక్షల కోట్లు చెల్లించటానికి 67వేల కోట్లు పెట్రోల్‌పై సెస్‌ వేశారు.మిగిలిన 2.33 లక్షల కోట్లను రాష్ట్రాలే బయట అప్పులు తెచ్చుకోవాలని... ఇది దైవ నిర్ణయమని చెప్పారు.మన ఆర్థిక వ్యవస్థ 24 శాతం పతనం అయింది.కరోనా దెబ్బకు ప్రపంచంలో 9.77లక్షలమంది చనిపోతే మన దేశంలో 90 వేలమంది చనిపోయారు.ఇటువంటి సమయంలో వైద్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేయాలి. యంత్రాలు, భవనాలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. అమెరికాలో 10 శాతం, జర్మనీలో జపాన్‌ లో 5 శాతం, ప్రజలకు సహాయం కింద కేటాయించారు. దేశం 5 కోట్ల ఉద్యోగాలను కోల్పోయింది.పెట్టుబడిదారుల్ని సంపద సృష్టికర్తలు అంటున్నారు.వారే ఆత్మనిర్భర సాయంతో ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి.ఇపిఎస్‌ -95 పెన్షన్‌ స్కీం ఎత్తివేసి మామూలు పెన్షన్ ఇవ్వాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం వ్యవసాయ,గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలి.దేశమంతటా గ్రామస్థాయిలో నిల్వ, రవాణా సదుపాయాలతో గిడ్డంగుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయ్యాలి.నిల్వ చేసుకున్న ఉత్పత్తులకు గాను రుణాలు ఇవ్వాలి. రైతులకు పింఛను పథకం ,వడ్డీ లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు ఇవ్వాలి.నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. సహకార సంఘాల ద్వారా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులను మార్కెట్ చేయాలి.చిన్న రైతులు తమ పంటలను నిల్వ చేసుకోకుండా కల్లాల వద్దనే పంటలు అమ్ముకుని అవసరాలు తీర్చుకుంటారు. నిలువ చేసుకుని, దేశంలో ఎక్కడైనా అమ్ముకుని లాభపడలేరు.దేశంలో 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర ఉంది.మరిన్ని పంటలకు మద్ధతు ధర ఇవ్వాలి.దేశంలో పండిన గోధుమ, వరిలో 6 శాతం మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోంది. ద్రవ్యోల్బణం, రైతు పెట్టే పెట్టుబడి కంచె, బోరుబావి , పొలం చదునుచేయడం అన్నీ రైతుకు ఖర్చులే.కార్పొరేట్ కంపెనీలతో కలిసి రైతులు కాంట్రాక్టు వ్యవసాయం చేయలేరు.ఇంతకంటే మార్కెట్ కమిటీలు నయం. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పితే ఎఫ్‌సీఐ తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసేది.లాభాలుంటేనే వ్యాపారం చేసే బహుళజాతి కంపెనీలు ప్రజాపంపిణీ వ్యవస్థకు సహకరించవు. వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ బహుళజాతి కంపెనీలపరమైతే మార్కెట్‌ యార్డుల్లో స్థానికంగా ఉండే వ్యాపారులు, దళారులు , హమాలీలు, కూలీలకు ఉపాధి దొరకదు. కార్పొరేట్లకు 20 లక్షల కోట్లు పన్నుల రాయితీ దొరికింది.బ్యాంకులు, బొగ్గు గనులు, బీమా సంస్థలు, రైల్వేలు వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. బడా వ్యాపారులు, నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు.అంబానీ, ఆదానీ, వాల్‌మార్ట్‌ వంటి పెద్దపెద్ద కార్పొరేట్లకు రైతుల నుంచి భూమి సేకరించి ఇస్తే వాళ్లు కాంట్రాక్టు వ్యవసాయం చేస్తారు. రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ మార్కెట్‌ రంగాలపై కేంద్రం పెత్తనం వస్తుంది. మారిన కార్మిక చట్టాలతో ఉద్యోగ భయం, జీతాల కోత బెంగ పెరిగింది. ముందస్తు అనుమతి లేకుండా లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్‌లు చేయొచ్చు. లేదా మూసివేయొచ్చు.కార్మికుల పనిగంటలు పెంచారు. ప్రమాదాలలో చనిపోయిన కార్మికులకు సాయం పెంచాలి. వ్యవసాయ బిల్లుల ద్వారా ప్రజలకు అన్నంపెట్టే రైతులకు కూడా మేలు చెయ్యాలి.
నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి