ఉసురు తియ్యకండి
ఆంధ్రజ్యోతి ప్రజావాక్కు 6-8-2003 ఎన్. రహంతుల్లా
విజయవాడ
జీవితమంతా కష్టించి సంపాదించిన
దానితో ఎంతో మక్కువతో నిర్మించుకున్న
భవనాలను రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం కూలగొడుతున్నది.
ఈ చర్య ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నది. ఆ విధంగా
కూలగొట్టిన భవనాల వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదు. దశాబ్దాల నుండి స్థిరపడ్డవారు తమ నివాసాలు కళ్ళముందే కూలిపోతుంటే
మానసిక రోగులవుతున్నారు. ఇక ప్రభుత్వం
అందింతే ఆర్ధిక సహాయం ఎందుకూ సరిపోక
పునరాశ్రయం దొరకక ఎందరో వీధులపాలవుతున్నారు. ఇది
ప్రభుత్వానికి, పాలక పార్టీ జయం కాదు. అందువల్ల
విధంగా భవనాలు కూలగొట్టిన
సందర్భాలలో ఆయా భవనాల యజమానులకు, వారి కుటుంబాలకు-అభ్యంతరం లేని అక్రమణలను క్రమబద్ధం చేసి
పట్టాలివ్వాలి. భవన నిర్మాణానికి కూడా
సహాయం అందించి తీరాలి. నిర్మాణాలతో స్థిరపడిపోయిన
రోడ్లను విస్తరించే కంటె ఊరి చుట్టూ కొత్త రోడ్లు నిర్మాంచాలి. పడగొట్టే భవనాలకు ఖచ్చితంగా మార్కెట్ రేటు
ఇచ్చి నిరాశ్రయుల్ని ఆదుకోవాలి. దయ
ఉంచి వారి ఉసురు తీయవద్దు.
ఇంతకీ ఎవర్ని
నమ్మాలి ?
ఆంధ్రజ్యోతి 23-9-1989 నూర్
బాషా రహంతుల్లా దిల్
సుక్ నగర్
మిగులు
భూములపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే బిల్లు గురించి మాట్లాడుతూ సి.పి.యం. సభ్యుడు శ్రీ జక్కా వెంకయ్య రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 20 లక్షల ఎకరాల మిగులు భూమి ఉంటే 3
లక్షల ఎకరాలు మాత్రమే పంపిణీ
చేశారన్నారు. సి.పి.ఐ. సభ్యుడు శ్రీ రజబలీ 20 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని విమర్శించారు. అయితే రెవిన్యూ మంత్రి
శ్రీ వీరయ్య మాట్లాడుతూ 14 లక్షల 11
వేల ఎకరాల మిగులు భూమిని గుర్తించామని,
అందులో 4 లక్షల 6వేల ఎకరాలు పంచివేశామని చెప్పారు. ఇంతకీ వీళ్ళు చెప్పిన అంకెల్లో దేనిని నమ్మాలి?
ఒక వేళ రెవిన్యూ మంత్రి మాటే నిజమని భావిస్తే ఇంకా
పంచవలసిన భూమి 10 లక్షల ఎకరాలు ఉంది.
అయితే 1981 నాటికే మన రాష్ట్రంలో 46 లక్షల
కుటుంబాలు అంటే 230 లక్షల మంది ప్రజలు భూమి లేని నిరుపేదలుగా
ఉన్నారు. ఇంతమందికి ఈ పది లక్షల ఎకరాలు ఏ మూల కబురు?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి