స్త్రీల పేరుతోనే రేషన్ కార్డులు
ఈనాడు 4-9-1992
సంపాదించిన
చివరి పైసాను మద్యపానం, జూదం వంటి వ్యసనాలకు ఖర్చు చేసి
భార్యా బిడ్డలను వీధిపాలు చేసే పురుషులను దృష్టిలో ఉంచుకొని ఇక పైన భూమి పట్టాలు
స్త్రీలకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షదాయకం. ఇదే విధంగా రేషన్
కార్డులను సైతం స్త్రీల పేరుతోనే ఇస్తే బోగస్ కార్డులు తగ్గడమే కాకుండా డీలర్ల
వద్ద కార్డులు తాకట్టు పెట్టుకునే వారి ఆటకడుతుంది. ఆడవారి పేరుమీద ఆస్తి ఉంటే
వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వరకట్న మరణాలూ చాలా వరకు తగ్గుతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి